కర్నూలు జిల్లా : మామిడి రైతుల ఆశలు చిగురించాయి. చెట్ల నిండా వచ్చిన పూతతో తోటలు కళకళలాడుతున్నాయి. వాతావరణం అనుకూలిస్తుండటంతో ఈ ఏడాది ముందుస్తుగా దిగుబడి వచ్చే అవకాశం ఉంది. రైతులకు నష్టం వాటిల్లకుండా కాయ నాణ్యత పెంచేందుకు అధికారులు పలు సూచనలు చేస్తున్నారు.