అనంతపురం జిల్లా : అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతంగా పేరొందిన అనంతపురం జిల్లాలో తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించాలంటే బిందు, తుంపర సేద్యమే దిక్కు. ఈ ప్రాంత రైతుల అవసరాలకు అనుగుణంగా బిందు–తుంపర సేద్యం పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది.